ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువయ్యారు. మాజీ సీఎం కేసీఆర్పై గౌరవం వ్యక్తం చేస్తూనే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రశంసించారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉప ఎన్నికలకు భయపడనని, ప్రజలే అంతిమ నిర్ణేతలని స్పష్టం చేశారు. ఎప్పుడూ భారీ మెజారిటీతో గెలిచానని గుర్తు చేశారు. పదవికంటే ప్రజల గౌరవమే ముఖ్యమని.. బస్తీల్లో తిరుగుతూ సమస్యలపై దృష్టి పెట్టుతున్నానన్నారు. ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమని సంకేతాలిచ్చారు.