తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Anumula Revanth Reddy) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించి.. మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ.. పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత కాంగ్రెస్లో చేరారు.