Visakhapatnam Kailasagiri Train Rolls Back: విశాఖపట్నం కైలాసగిరిలో టాయ్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వెనక్కి జారింది. అదృష్టవశాత్తు, వంద మందికి పైగా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఓవర్ లోడ్ లేదా సాంకేతిక లోపంపై స్పష్టత లేదు. అధికారులు తాత్కాలికంగా రైలును నిలిపివేశారు. వరుస సెలవులు, వీకెండ్ కావడంతో కైలాసగిరికి నగరంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.