కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినా.. ప్రణాళిక లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్ అధికారులు కొలతలు తీస్తుండగా.. మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారతాయని భక్తులు ఆశిస్తున్నారు.