కొండగట్టు అంజన్న ఆలయ అధికారులు భక్తులకు షాకింగ్ వార్త అందించారు. దర్శనం, పూజ టికెట్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చందన పూట టికెట్ ధర రూ.800 నుంచి రూ.1500కు, అంతరాలయ దర్శనం టికెట్ రూ.400 నుంచి రూ.800కు పెంచారు. శాశ్వత అభిషేకం ధర రూ.1,116 నుంచి రూ.10 వేలకు పెరిగింది. ఈ కొత్త ధరలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.