కొండగట్టు అంజన్న ఆలయ హుండీల్లో లేఖలు బయటపడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుండీలో డబ్బులు వేయం అంటూ పలువురు భక్తులు పదుల సంఖ్యలో లేఖలు రాసి.. హుండీల్లో వేయగా.. హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. కొండగట్టు ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ భక్తులు లేఖలు రాసి వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.