హైదరాబాద్ కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ పార్టీని అశోక్ నాయుడు అనే వ్యక్తి నిర్వహించగా.. ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు. ఏపీ నుంచి యువతులను తీసుకొచ్చి డ్రగ్స్తో పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కారుల్లో ఒక ఫార్చ్యూనర్ కారుపై ఎంపీ స్టిక్కర్ ఉండటంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఎంపీ సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.