పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత నెలకొన్నా.. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం మాత్రం నిశ్చింతగా ఉంది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇక్కడ ప్రతి ఇంటికీ 3 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు, ఇండక్షన్ స్టవ్లు అందజేశారు. దీనివల్ల 410 కుటుంబాలు ఈ-కుకింగ్కు మారి గ్యాస్ ఖర్చును ఆదా చేయడమే కాకుండా.. మిగులు విద్యుత్తును గ్రిడ్కు అమ్మి యూనిట్కు రూ. 5.25 ఆదాయం పొందుతున్నాయి.