వరంగల్ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బింగించింది. ఇందులో భాగంగానే.. మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి పట్టుబట్టి మరీ కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. ఈ సందర్భంగా.. తన నివాసంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.