Macherla Old Couple Cheated By Son: పల్నాడు జిల్లాలో ఒక వృద్ధ దంపతుల కన్నీటి గాథ ఇది. బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి దంపతులు తమ కుమారుడు అంజిరెడ్డిని అమెరికాకు పంపి బాగా చదివించారు. ఆస్తులన్నీ అమ్మేశారు. అయితే, కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా, కుమారుడు భరణం కూడా ఇవ్వడం లేదు. ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.