Hyderabad Blind Couple: మూడు రోజుల పాటు తిండి, నీళ్లు లేక.. కనీసం పలకరించేవాళ్లు కూడా లేక.. అంధ వృద్ధ దంపతులు ధీన స్థితిలో మగ్గిపోయారు. చూపులేకపోవటంతో.. తమ కుమారుడు చనిపోయిన విషయం కూడా తెలియక.. మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనలోనే ఉండిపోయారు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు తెలియజేయటంతో.. ఘటనా స్థలికి వెళ్లి చూడగా.. భరించలేని దుర్వాసనలో, దీన స్థితిలో ఉన్న ఆ వృద్ధ దంపతులను పోలీసులు గుర్తించారు.