హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మరో కన్నీరు పెట్టించే విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల్లో కొత్తింట్లోకి వెళ్లాల్సి ఉండగా.. అంతలోనే ఘోరం జరిగిపోయింది. కొత్తింట్లోకి సందడిగా, ఆనందంగా వెళ్లాలని భావించిన ప్రహ్లాద్ మోదీ కుటుంబంలోని 10 మంది మృతదేహాలుగా ఆ ఇంట్లోకి చేరుకున్నారు. దీంతో వారి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.