సీబీఐలో జేడీగా పని చేసిన వీవీ లక్ష్మీనారాయణ.. కొత్త జాబ్లో చేరారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్, తర్వాత ఎంటెక్ చదివిన లక్ష్మీనారాయణ.. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు అశోక లేల్యాండ్లో పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఈవీ ట్రాన్స్లో చేరారు.