కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే అప్లై చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను రెడీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.