ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పింఛన్ల పెంపుతో రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే మొంథా తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు. ఆ వివరాలు..