ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం సహకారంతో వేగవంతం చేసింది. తాజాగా మరోచోట ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. మంగళగిరిలో రూ.200 కోట్లతో 1.25 కిలోమీటర్ల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టి.. ఖరారు చేశారు. త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ వైపు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.