తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము రూపంలోనే ఎక్సైజ్ శాఖకు రూ. 36.68 కోట్లు ఆదాయం సమకూరింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని 4 బార్లకు కలిపి మెుత్తం 148 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 13న డ్రా పద్ధతి ద్వారా బార్లను కేటాయించనున్నారు.