హైదరాబాద్ శివారులో నిర్మించిన చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైల్వే మంత్రికి లేఖ రాశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరును తొలగించగా.. మరో విధంగా ఆ మహనీయుడి త్యాగాలను గుర్తుంచుకునేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పేరు పెట్టాలని అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు.