సుమారు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు. పెద్దపల్లి పరిధిలో మంజూరైన ఆర్వోబీలు, ఎఫ్ఓబీల పనుల్లో జాప్యాన్ని కూడా ప్రస్తావించారు. రామగుండం–మణుగూరు లైన్ పూర్తయితే పారిశ్రామిక, వాణిజ్య, సరుకు రవాణా రంగాలకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు.