కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇటీవలె తొలి విడతలో రూ.259.36 కోట్ల నిధులను విడుదల చేసిన మోదీ సర్కార్.. తాజాగా రెండో విడతలో భాగంగా మరో రూ.387 కోట్లను రిలీజ్ చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో.. 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉండగా.. ఇప్పుడు అవి విడుదల అవుతున్నాయి.