కొత్త హైవే అని దూసుకెళ్తున్నారా.. 32 చోట్ల కెమెరాలు.. స్పీడ్ 100 కి.మీ. దాటితే క్షణాల్లో ఫైన్.!

7 months ago 22
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి 340సీ కొత్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ 34 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. అయితే కొత్త జాతీయ రహదారి కావటంతో వాహనదారులు అధిక వేగంతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుల వేగానికి కళ్లెం వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జాతీయ రహదారి 340సీ మీద నన్నూరు టోల్ ప్లాజా నుంచి మండ్లెమ్ వరకూ 34 కిలోమీటర్ల మేరకూ 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అతివేగంతో వాహనం నడిపేవారిని గుర్తించేలా ఏర్పాట్లు చేశారు.
Read Entire Article