ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్లకు.. సీఎం రేవంత్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు అదనంగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సీఎం నిధి నుంచి గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.