Kurnool Nandyal 100 New Electric Buses Soon: కేంద్రం ఏపీకి ఎలక్ట్రిక్ బస్సుల్ని కేటాయించింది.. త్వరలోనే అవి రాష్ట్రానికి రానున్నాయి. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాలకు కలిపి 100 బస్సులు కేటాయించారు. ముందు కర్నూలుకు 50 బస్సులు రానుండగా.. మరో 50 బస్సులు నంద్యాలకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బస్సుల కోసం కొత్తగా రెండు డిపోలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆ కసరత్తు కొనసాగుతోంది.