నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, లంచాల కారణంగా అనర్హులకు సైతం తెల్ల రేషన్ కార్డులు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన పేదల కంటే లక్షకు పైగా ఎక్కువ కుటుంబాలకు కార్డులు మంజూరు కావడం దీనికి నిదర్శనం.