భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. అనువైన స్థలాల గుర్తింపునకు ఈ నెల 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. జిల్లాలో నాలుగైదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను బృందం పరిశీలించనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. భద్రాచలం ఆలయ ప్రాధాన్యం, జిల్లాకు విమానాశ్రయం అవసరాన్ని వివరించారు. సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వస్తే తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.