ఒక సాధారణ డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆ వ్యక్తి.. ఇవాళ ఒక కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆయనే కొత్తగూడెం మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేష్. ఇటీవలి ఎన్నికల్లో సీపీఐ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. కార్మికుల హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తూ.. పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన డ్రైవర్ స్థాయి నుంచి నేడు ఏకంగా మేయర్గా ఎన్నికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.