New Bride Dies in Siddipet: కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న నూతన దంపతుల ఆశలు, కలలు, కోరికలను ఒక్క ప్రమాదం నాశనం చేసింది. పెళ్లైన తర్వాత విధుల్లో తిరిగి చేరడం కోసం హైదరాబాద్ వెళ్తున్న నూతన దంపతులను రోడ్డు ప్రమాదం విడదీసింది. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రణతి మృతి చెందగా, భర్త సాయికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి సందడి ఇంకా ముగియకముందే జరిగిన ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.