కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైన అఘోరీ మాత.. మరోసారి హల్చల్ చేసింది. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ.. అక్కడికి వెళ్లిన అఘోరి మాత హింసాకాండ సృష్టించింది. భక్తులకు భయబ్రాంతులకు గురిచేసింది. దిగంబరావతారంలో వెళ్లిన ఆమెను బట్టలేసుకొస్తేనే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు, సిబ్బంది చెప్పటంతో కోపంతో ఊగిపోయిన అఘోరి.. కత్తితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.