తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలకు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రైవింగ్ సెన్స్ లేకపోవడమే కారణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. లారీలు, టిప్పర్ల డ్రైవర్లు సరైన శిక్షణ లేకుండానే.. దళారుల వ్యవస్థ ద్వారా ‘వితౌట్ టెస్ట్’ లైసెన్సులు పొందుతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖలోని ఈ లోపాల వల్ల నాసిరకం డ్రైవర్లు రోడ్లపైకి వస్తున్నారు. మొబైల్ మాట్లాడుతూ దూసుకెళ్లే ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. ఇకనైనా అధికారులు వీటిపై దృష్టి సారించి అర్హత ఉన్న వాహనదారులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.