హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు బెంచ్మార్క్గా నిలిచిన కోకాపేట నియోపొలిస్ భూముల మూడో విడత ఈ వేలం ముగిసింది. గత రికార్డు ధరలతో పోలిస్తే.. ఈ విడతలో ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు జరిగిన వేలంలో ప్లాట్ నెం. 19లో ఎకరం ధర రూ. 131 కోట్లు, ప్లాట్ నెం. 20లో ఎకరం ధర రూ. 118 కోట్లు పలికింది. 8.04 ఎకరాల విక్రయం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,000 కోట్ల ఆదాయం వచ్చింది. మూడు విడతల్లో మొత్తం 27 ఎకరాలకు రూ. 3,708 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 5న మరో విడత వేలం జరగనుంది.