యూట్యూబ్ రాకతో ప్రపంచమంతా తెలంగాణ జానపదం వినిపిస్తోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ నేడు కోట్లాది మందిని ఆకట్టుకుంటున్నాయి. కళాకారులకు ఆదాయ వనరుగా, తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ఇది కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవకాశాలు వచ్చేలా చేస్తోంది. దాదాపు రూ.2, 3 లక్షలతో చిత్రీకరించిన పాటలు.. కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ఇటీవల రాను బొంబాయికి రాను.. పాట యూట్యూబ్లో రికార్డు సృష్టించింది. 400 మిలియిన్ వ్యూస్ సొంతం చేసుకుని రూ.కోటి వరకు ఆదాయం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణలో జానపదాలు ఎలా వికసిస్తున్నాయో తెలుసుకుందాం.