Kurnool Kodumuru Hostel incident: కర్నూలు జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థి అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పదో తరగతి విద్యార్థి బెల్టుతో చితకబాదాడు. వదిలేయమంటూ కాళ్లా వేళ్లా పడినా కనికరం చూపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు.