Kothapeta 30 Feet Digging: కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ఇంటిలో 30 అడుగుల లోతున గొయ్యి తవ్వారు. అయితే అక్కడ పూజలు కూడా చేస్తుండటంతో స్థానికులు వెళ్లి ప్రశ్నించారు. అనంతరం వారందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు పూజలు నిర్వహించడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గుప్త నిధుల కోసం ఇలా తవ్వినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.