అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏటా కిందకు కుంగుతోందనే అనుమానాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ అనుమానాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన జీవీ సుందర్ అనే వ్యక్తి చేసిన వీడియోతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. కోనసీమ జిల్లా ఏటా 10 నుంచి 20 మిమీ కిందకు కుంగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.