అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. ఈ కుటుంబానికి పరిచయమున్న వ్యక్తే.. బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలించడానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. బాలిక తన తల్లికి ఆ విషయం చెబుతుందేమోనన్న అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే అతడు చేసిన అతి ప్రవర్తన వల్ల పోలీసులకు దొరికిపోయాడు.