గంజాయి, మత్తుపదార్థాల వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా మారింది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో గంజాయి చాక్లెట్లు తరలిస్తూ ఓ యువకుడు పోీలీసులకు పట్టుబడ్డాడు. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ గల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకుంటోంది.