క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీల కాన్వాయ్పై దాడి చేశారని.. బాల్క సుమన్ సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో.. క్యాతనపల్లిలో ఘర్షణ తలెత్తింది. బాల్క సుమన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో.. అక్కడ రణరంగంగా మారింది. ఉద్రిక్తతల మధ్య క్యాతనపల్లి బంద్ కొనసాగుతోంది.