Visakhapatnam Real Estate Boost Up: విశాఖపట్నం ఐటీ హబ్గా, ఏఐ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు రాకతో నగరంలో స్థిరాస్తికి డిమాండ్ పెరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 14-16 తేదీల్లో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్-2025 స్థిరాస్తి రంగంపై అవగాహన కల్పించనుంది.