హైదరాబాద్ శివారుల్లో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రాష్ట్రంలో గుండెపోటు మరణాలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ హఠాన్మరణాలకు కారణాలపై వైద్య నిపుణులు అధ్యయనం చేయాలని కోరుతున్నారు.