హైదరాబాద్ను క్లీన్ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని, ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సీఎం అధికారులకు సూచించారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త డంపింగ్ యార్డులను త్వరగా అందుబాటులోకి తెవాలని ఆదేశించారు.