అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడకు ప్రపంచస్థాయి కంపెనీలు రాబోతున్నాయి. దీనిలో భాగంగా క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, త్వరలోనే అమరావతికి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే 22ఏ భూముల సమస్యలకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు. హైదరాబాద్ మాదిరే ఏపీ రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆ వివరాలు..