తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసిన ప్రతీ గింజను కొంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రతి క్వింటాకు మద్దతు ధర కల్పిస్తామని.. వాటితో పాటు.. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు తొందరపడి.. దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు.