మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. తన అన్నకు మంత్రి పదవి ఉంటే తనకు ఇవ్వకూడదనే నిబంధన ఉందా? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు.. నల్గొండ జిల్లా నుంచి ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.