Venkateswara Swamy Temple Construction in Khammam: ఖమ్మం జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ప్రతిపాదనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.