ఒక అకడమిక్ ఇయర్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందేందుకు ఎంత కష్టపడి చదవాలో మనందరికీ తెలుసు. అదే ప్రభుత్వ ఉద్యోగం విషయానికి వస్తే.. దానికి మరింత శ్రమ, పట్టుదల, త్యాగం అవసరం. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడినప్పుడే అలాంటి ఉద్యోగం లభిస్తుంది. అలాంటి కృషి చేసి ఒక వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఉద్యోగం పొందాడు. కానీ ఆ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, అతడికి దురాలోచన పట్టింది. మోసపూరిత మార్గంలో నడిచాడు. పది నెలల్లోనే రూ.13.71 కోట్లు అక్రమంగా దోచుకుని పరారయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా..