ప్రభుత్వ ఉద్యోగుల హాజరు కోసం కొత్త టెక్నాలజీలు వచ్చినా మోసాలు ఆగడం లేదు. జగిత్యాల జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోతోనే హాజరు వేసుకున్నాడు. అధికారులు తనిఖీ చేయగా విషయం బయటపడటంతో సస్పెండ్ చేశారు. ఇంకా చాలా మంది ఉద్యోగులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కొందరు ఖాళీ కూర్చీలను పెట్టి హాజరు వేసుకుంటున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.