నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్ల దాడిలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. కారుతో ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలవడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.