తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం, పార్టీ నాయకత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మరోసారి ఘాటుగా స్పందిస్తూ పార్టీ లైన్ దాటితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో సురేఖను ఒకసారి కాపాడామని.. ఈసారి మాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు.