తెలంగాణలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. హైదరాబాద్ ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నిజామాబాద్లోనూ టవర్స్ నిర్మిస్తామన్నారు. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరకే సిమెంట్ లభ్యమయ్యేలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు.