పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే పాకిస్థాన్తో సమస్యకు శాశ్వత పరిష్కారమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం వస్తే తానూ వార్లో పాల్గొంటానన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలపై దాడులు చేసి పాక్కు బుద్ధి చెప్పామన్నారు. రఫేల్ కూల్చివేతపై పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. డ్రోన్ దాడులను తిప్పికొట్టామన్నారు.